బస్తి లో 1956లో స్థాపించిన ఈ కేంద్రం ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాల వారికి బాగా ఉపయోగ పడుతోంది. ఈకేంద్రం కళాత్మకంగా ఏర్పరచాతంతో అనేకమంది పరిశోధకులే కాదు, టూరిస్టులు కూడా ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.
ఈ కేంద్రంలో పండ్లు , అలంకరణ మొక్కలు, కూరగాయల తోటలు మొదలుగు వాటిపై విస్తృత పరిశోధనలు చేస్తారు. ఈ కేంద్రం లో మష్ రూమ్ , తేనెటీగల పెంపకం వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేయటమే కాక, రైతులకు వీటి సాగుకు అవసరమైన ముడి సరుకులు కూడా అందిస్తారు.
ఈ కేంద్రం అత్యధిక నాణ్యత కల తియ్యటి ఆమ్రపాలి, రోమన్ , నీలం వంటి రకాల మామిడి పండ్లను పండించటం లో కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. రైతులకు ఈ రకాల పండ్ల విత్తనాలను అందిస్తుంది.