పర్యాటకులు తమ బేలూర్ విహారయాత్రలో, సమయం అనుకూలిస్తే, విష్ణు సముద్రముగా ప్రసిద్ధి గాంచిన పెద్ద సరస్సును దర్శించవచ్చు. ఈ సరస్సు పద్మరాస పర్యవేక్షణలో నరసింహ రాయల కాలములో నిర్మించారు. ఈ ట్యాంక్ స్వర్ణ యుగం గా పిలవబడె, విజయ నగర రాజుల కాలములో నిర్మించబడినది . కృష్ణ దేవరాయల కాలంలో, ఉత్పతనహళ్లి కి చెందిన బసప్ప నాయక ఈ చతుర్శ్రాకారపు సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు. ఈ మెట్ల సహాయంతో, ప్రజలు తేలిగ్గా క్రిందికి వెళ్లి రోజువారీ పవిత్ర కార్యాల కోసం పవిత్ర జలం ఉపయోగించుకుంటారు. అతను సత్రాలతో పాటు పవిత్ర తెప్పోత్సవం జరుపుకునేందుకు పుష్కరిణి మధ్యలో ఒక ద్వీప మంటపం కూడా నిర్మించాడు.