జామియా మసీద్ కు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఈ మసీదు 851 హిజీరాలో బంగారు గోపురం కలిగి ఉండేది. దీని కారణంగా జామియా మసీదు పేరుగాంచింది. చిన్నద పల్లి అంటే బంగారు మసీదు అని చెపుతారు. దీనిలో మూడు అంతస్తులు, ఒక బేస్ మెంట్ ఉండి షుమారు పదివేలమంది ప్రార్ధన చేసేటందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మసీదు పక్కన ఒక కార్యాలయ భవనం ఉంది. దానిని ముహక్మా ఎ షేరియా అంటే, తగవుల పరిష్కార ప్రదేశంగా వ్యవహరిస్తారు.