పర్యాటకులు భట్కల్ బీచ్ ని భట్కల్ ఓడరేవు పట్టణ సందర్శనలో చూడవచ్చు. చుట్టూ పడమటి కనుమల కొండలు, కొబ్బరి చెట్లు, భట్కల్ బీచ్, అరేబియా సముద్రం కలిగి ఎంతో అందంగా ఉంటుంది. 16వ శతాబ్దంలో దీనిని ప్రధాన ఓడరేవులలో ఒకటిగా విజయనగర సామ్రాజ్య పాలకులు పరిగణించేవారు. మురుడేశ్వర...
భట్కల్ లైట్ హౌస్ ను 1891 లో నిర్మించారు. ఇది భట్కల్ పట్టణ ఆకర్షణలలో ఒకటి. ఇది భట్కల్ నది ప్రవేశంలో దక్షిణ దిశగా ఒక కొండపై భట్కల్ కోట సమీపంలో ఉంది. అది గతంలో తెల్లటి రాతి టవర్ గా ఉండేది. దానినే ఒక లైట్ హౌస్ గా మార్చి సంకేతాలు 1936 లో ఏర్పరచారు. కనుక ఇపుడు అది ఒక...
కడవినకట్ట డ్యామ్, భట్కల్ కడవినకట్ట డ్యామ్ ను వెంకటాపూర్ నదిపై నిర్మించారు. భట్కల్ పట్టణానికి ఈ డ్యామ్ నీటిని సరఫరా చేస్తుంది. ఈ డ్యాము నిండిందంటే చాలు పట్టణానికి నీటి కొరత లేనట్లే. స్విమ్మింగ్ ఈ ప్రదేశంలో ప్రమాదకరంగా ఉంటుంది.
భట్కల్ సందర్శనలో సమయం ఉంటే, పర్యాటకులు కేతపయ్య నారాయణ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయంలో విజయనగర సామ్రాజ్య శిల్ప సంపద కనపడుతుంది. విజయనగర రాజ్య శిల్పాలు అనేకం చెక్కారు. నవరంగ గా చెప్పబడే ఒక నాలుగు స్తంభాల పెద్ద హాలు నిర్మించారు. దీని చుట్టూ అష్ట దిక్పాలక...
భట్కల్ లోని ఎనిమిది పురాతన మసీదులలో ఖలీఫా జామియా మసీద్ ఒకటి. ఇది సుమారుగా 200 సంవత్సరాలక్రిందటిది. ఈ మసీదు షరాబి నది ఒడ్డున ఖలీఫా వీధిలో ఉంది. పురాతన మసీదు 1966లో కూల్చి కొత్త నిర్మాణాన్ని ఒక రెండు గోపురాలపై 1972 లో నిర్మించారు
భట్కల్ పర్యాటకులు పురాతన ముస్లిం నివాస ప్రదేశంలో కల మఖ్దూమ్ మసీద్ తప్పక చూడాలి. మసీదు పేరు మఖ్దూమ్ కాలనీ నుండి తీసుకొనబడింది. అంటే అది హజరత్ మఖ్దూమ్ ఫాకి ఇస్మాయిల్ సూక్రి పేరు పై పెట్టబడింది. ఆ ప్రవక్త సుమారు నలభైరోజులు ప్రార్ధనలు చేసి అల్లాను మెప్పించాడని...
నూర్ మసీదును 1966 లో నిర్మించారు. ఇది నేషనల్ హైవే లో కలదు. ఈ మసీదు రాష్ట్రంలోని అన్ని మసీదులకంటే ఉత్తమమైంది. దీనిని 1987లో ఒక సారి పునరుద్ధరించారు. సుమారు 1500 మంది వరకు ప్రార్ధనలు చేయగల ఈ మసీదును పర్యాటకులు తప్పక చూడాలి.
సుల్తాన్ మసీదును టిప్పు సుల్తాన్ నిర్మించారు. 1211 హిజీరాలో నిర్మించిన ఈ కట్టడం ద్రవిడ శిల్ప శైలిని కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో భక్తులు తమ నమాజ్ ఈ మసీదులో చేసుకుంటారు.
జామియా మసీద్ కు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఈ మసీదు 851 హిజీరాలో బంగారు గోపురం కలిగి ఉండేది. దీని కారణంగా జామియా మసీదు పేరుగాంచింది. చిన్నద పల్లి అంటే బంగారు మసీదు అని చెపుతారు. దీనిలో మూడు అంతస్తులు, ఒక బేస్ మెంట్ ఉండి షుమారు పదివేలమంది...