నారా నాగ్ లేదా నారాయణ్ నాగ్ ఖాగ్ గ్రామానికి దగ్గరలో ఉన్న అందమైన కొలను. తోసామైదాన్ సరస్సు నుండి ఈ కొలను ఉద్భవించినదని నమ్మకం. భూగర్భం లో కొన్ని కిలోమీటర్లు ప్రవహించిన తరువాత ఈ కొలను తోసామైదాన్ సరస్సు లో కలుస్తుంది.
కొన్ని ఏళ్ళ క్రితం ఈ దారి గూండా ప్రయాణించిన ఒక సన్యాసి తోసా మైదాన్ మరియు నారా నాగ్ కి మధ్యలో ఉన్న అనుసంధాన్ని కనుగొన్నాడని గాధలు చెబుతున్నాయి. గొర్రెల విసర్జాన్ని ఒక సంచిలో తీసుకు వెళుతున్న ఆ సన్యాసి పొరపాటున ఆ సంచీని ఈ తోసా మైదాన్ సరస్సులో పడవేసాడు. కొన్ని రోజుల తరువాత ఆ పేడ నారా నాగ్ కొలను పైన తేలుతూ ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు. తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతను తిరిగి తోసా మైదాన్ సరస్సు కి వెళ్లి కొంత పసుపుని ఆ నీళ్ళలో చల్లాడు. కొన్ని రోజుల తరువాత నారా నాగ్ యొక్క నీళ్ళు ఆకుపచ్చగా మారి అతని నమ్మకాన్ని బలపరచాయి.