ఫెరోజ్పోర మరియు ఖాగ్ కి మధ్యలో, పోష్కేర్ గ్రామానికి తూర్పు వైపున ఉన్న ఈ పుష్కర్ నాగ్ చారిత్రక కొలను. కాశ్మీరీ పండితులు దియావై పాత్ అనబడే ప్రార్ధనలు హిందువుల క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం లో ఇక్కడ జరిపేవారని నమ్మకం. అంతే కాకుండా ఈ కొలనులో పండితులు ఆశీస్సులు అందుకునేందుకు మునిగి లేచే వారని అంటారు. నీల మఠ్ పురాణం లో ఈ కొలను ని ప్రస్తావించారు. వేద పఠనాలు చేస్తే కలిగేంత ఫలితం ఈ కొలను లో మునిగి తే కలుగుతుందని చెప్పబడినది.