ఓంకారేశ్వర దేవాలయం మడికెరి పట్టణ మధ్య భాగంలో కలదు. శివ భగవానుడు ప్రధాన దైవం. దీనిని 1820 లో లింగ రాజేంద్ర రాజు నిర్మించారు. హైదర్ ఆలి మరియు టిప్పు సుల్తాన్ లు కొడగు పై దండెత్తి దానిని పాలించిన కారణంగా దేవాలయ నిర్మాణం ఇస్లాం మత శిల్ప శైలిని చూపుతుంది. ఒక దర్గా వలె ఉండి లోపల శివలింగం కనపడుతుంది. ఇక్కడే ఒక సరస్సు కలదు. దాని మధ్యలో మంటపం ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని రాజు కాశీ నుండి తెచ్చి ప్రతిష్టించాడని చెపుతారు. రాజు ఒక బ్రాహ్మణుడిని తన రాజకీయ ఎత్తులు సాధించేందుకు వధించాడని, ఆ పాప పరిహారార్ధం దీనిని నిర్మించాడని, అయినప్పటికి బ్రాహ్మణుడి ఆత్మ, వ్యధ చెందుతూ బ్రహ్మ రాక్షస రూపంలో రాజును బాధించగా అపుడు రాజు ఒక దేవాలయాన్ని విగ్రహాన్ని పెట్టాడని కధనంగా ఉంది. ప్రవేశ ద్వారం వద్ద రాగి ఫలకం ఒకటి శిలా శాసనం కలిగి ఉంటుంది. దేవాలయంలో హిందూ మరియు ఇస్లాం శిల్ప శైలి కలిగి ఉండటం ఒక విశేషం.