1992 వ సంవత్సరంలో స్థాపించిన న్యూఢిల్లీ జాతీయ సైన్సు సెంటర్ భైరన్ రోడ్డు లో ప్రగతి మైదాన్ గేట్ నంబర్ 1కు దగ్గరగా ఉంది. ఈ మ్యూజియం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్సు మ్యూజియమ్స్ (ఎన్ సి ఎస్ ఎం) లో ఒక భాగం.
ఎనిమిది అంతస్తులు ఉన్న, ఈ నిక్షేపస్థలంలో సైన్సు, వాస్తు నిర్మాణం, చరిత్రకు సంబంధించిన ప్రదర్శకాలు ఉన్నాయి. సైన్సు ఔత్సాహికులకు ఉత్తమ ప్రదేశం, దీనిలో అందరూ విశేషించి యువ ఔత్సాహికులు, స్కూలు పిల్లలు తప్పక చూడవలసిన పలు ప్రదర్శన శాలలు, విభాగాలు ఉన్నాయి.
ఇక్కడ ఉన్న కొన్ని విభాగాలలో మానవ జీవ శాస్త్ర ప్రదర్శన శాల, వారసత్వ౦, డైనోసార్ల ప్రదర్శన శాల, వినోద విజ్ఞాన గ్రంధాలయం, పురాతన భారత విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విభాగం, వేద గణితం, ఆయుర్వేదంపై ఒక విభాగం, ఒక డి ఎన్ ఏ విభాగం ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి.
మ్యూజియం ప్రవేశం వద్ద ప్రదర్శించే ఒక శక్తి బంతి, దేశంలోఉన్న వినోదంతో కూడిన ఏకైక మల్టీమీడియా ప్రదర్శనశాల కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి.ఈ మ్యూజియం ప్రతిరోజు ఉదయం 10 నుండి 5 సాయంత్రం వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుంది, హోలీ, దీపావళి పండుగ రోజులలో మాత్రమే మూసి ఉంటుంది.