శ్రీనాథ్ జీ ఆలయాన్ని 1623 వ సంవత్సరంలో మహారావాల్ పుంజ్ రాజ్ నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ రాధికా జి, గోవర్ధన్ నాథ్ జి విగ్రహాలు ప్రధాన ఆకర్షణలు. పర్యాటకులు ప్రధాన ఆలయంలో ఉన్న గ్యాలరీని కూడా చూడవచ్చు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న అనేక చిన్న ఆలయాలను కూడా వీరు చూడవచ్చు. ఈ ఆలయాలతో పాటు పశ్చిమాన 16 ముఖాలు, తూర్పున 16 ముఖాలు, ఉత్తరాన 4 ముఖాలు ఉన్నాయి. ఈ మందిరాలలో శ్రీ బా౦కే బిహారి జి, శ్రీ రామచంద్ర జి విగ్రహాలు ఉన్నాయి. గూడ్ మండప్ గా పిలువబడే మూడు అంతస్తుల హాల్ మూడు ఆలయాలకు ఉమ్మడిగా విస్తరించి వుంది. ఈ హాలు 64 కాళ్ళతో, 12 స్తంభాలతో ఉంది.



Click it and Unblock the Notifications