ద్వారకా లోని ముఖ్య దేవాలయం అయిన ఈ ద్వారకాదిష్ దేవాలయం జగత్ మందిర్ (విశ్వ పుణ్యక్షేత్రం ) గా కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుడి రాజ్యం అయిన ద్వారకా మహాభారత యుద్ధం తరువాత నీటి లో మునిగిన తర్వాత శ్రీ కృష్ణుని ముని మనవడు గా చెప్పబడే వజ్రనాభుని చే నిర్మితమయినదిగా చెప్తారు. ఈ దేవాలయం చుట్టుత ఉన్నటువంటి కళాత్మక భవనం 16 వ శతాబ్దంలో నిర్మితమైనదిగా చెప్తారు.ఈద్ దేవాలయపు 43 మీటర్ల ఎత్తుఅయిన శిఖరం , దాని పైన సూర్య చెంద్రుల చిత్రాల జండా 10 కిలో మీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి. ఈద్ దేవాలయం మృదువయిన లైం స్టోన్ తో నిర్మితమైనది. దేనికున్న రెండు ద్వారాలు స్వర్గ ద్వార మరియు మోక్ష ద్వార గుండా భక్తులు లోనికి మరియు వెలుపలికి చేరుకుంటారు. ఈ దేవాలయం భక్తులకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9.30 వరకు, మధ్యలో 12.30 నుండి 5 గంటల వరకు విరామంతో భక్తులకు దర్సనానికి అందుబాటులో ఉంటుంది.



Click it and Unblock the Notifications