కోడుమూడి పన్నెండువేల ఆరువందల అరవై తొమ్మిది మంది జనాభాతో, ఈరోడ్ జిల్లలో ఉన్న తమిళనాడు పంచాయతీ పట్టణం. ఈ పట్టణ సగటు ఎత్తు నూట నలభైనాలుగు మీటర్లు. ఈ పట్టణం కైలాస పర్వతాలలో ఒకటని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఈ స్థలం కావేరీ నది ఒడ్డున ఉంది. బ్రమ్మోత్సవం పండుగా సాయంలో వేలమంది యాత్రీకులు ఈ ప్రాంతానికి వస్తారు. దీపాలు వెలిగించి ఈ నదిపై తేలియాడేటట్లు చేస్తారు. ఈ పట్టణాన్ని ప్రశంసిస్తూ ఆ గ్రంధాలలో వివిధ రచనలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ పట్టణం గొప్ప కళా విలువలనే కాకుండా పౌరాణిక విలువలను కూడా కలిగిఉంది. పవిత్రమైన కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం, సాంప్రదాయ పట్టణంగా భావిస్తారు, ఈ పట్టణ ప్రజలు చిట్టిరాయ్, ఆవని వంటి ధార్మిక పండుగలను నిర్వహిస్తారు.