తమిళనాడు లోని ఈరోడ్ జిల్లాలోని చిన్న పట్టణం పరియుర్ లో ఉన్న ప్రసిద్ధ ఆలయం పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం. ఈ ఆలయం అసలు పేరు అరుళ్మిగు కొండత కాళీ అమ్మన్ ఆలయం. ప్రతి ఏటా ఈ ఆలయ ప్రాంగణంలో పొంగల్, నవరాత్రి పండుగలు జరుగుతాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిని పోలి ఉంటుంది. స్థానికులు ఈ ఆలయం పదిహేను వందల ఏళ్ళ కంటే పురాతనమైనదిగా విశ్వసిస్తారు. ఆలయ గర్భగుడిని నల్ల చలువరాయితో నిర్మించారు. ఈ ఆలయానికి ఐదు అంతస్తుల నిర్మాణంతో కూడిన బాహ్య మండపం ఉంది. ఉత్తర దిక్కున ఉన్న ఈ ఆలయ ప్రధాన దేవత తలపై అగ్ని కిరీటం ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా కొద్దోగొప్పో తేమతో కూడి ఉంటుంది. ఈ ఆలయ౦లొ సిద్ది వినాయకునికి చెందిన విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా రధోత్సవం జరుగుతుంది.