జై విలాస్ పాలస్ సిందియ వంశస్తుల నివాసం. ఇపుడు దీనిలో కొంత భాగం మ్యూజియం చేసారు. దీనిని 1809 లో జియాజి రావు సిందియ నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన శిల్ప కల కలిగి వుంటుంది. దీనిలో అనేక కళా కృతులు, సిందియ పాలనా కు చెందిన పత్రాలు, ఔరంగజేబ్, షా జహాన్ ల ఆయుధాలు ఇక్కడ ఉంచారు. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఓడలు నమూనాలు కూడా కలవు. ఇక్కడ కల బెల్జియం చాన్దిలియర్లు ఒక ప్రత్యేక ఆకర్షణ. చరిత్రకారులకు, పర్యాటకులకు కూడా ఇది ఆకర్షనీయంగా వుంటుంది.