దుర్గ మాతకు అంకితం చేసిన ఈ జాయి దుర్గ ఆలయం హజో లో ప్రసిద్ద ఆలయం. ఇది షుమారు 1774 వ సంవత్సరంలో లక్ష్మినాధ సిన్ఘ రాజుచే నిర్మించబడింది, ఈ ఆలయంలోని పీఠంపై అందమైన దుర్గామాత రాత్రి ప్రతిబింబ౦ ఉంది. లక్ష్మినత సిన్ఘ అప్పటి అహోం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు.
దుర్గాదేవిని హిందువులు అత్యంత భయంకరమైన దేవతలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆమె ధైర్యానికి చెందిన అనేక కధలు, ఎలా ఆమె రాక్షసులపై పోరాడిందో పురాణాలలో నిండి ఉంటుంది. జాయ్ దుర్గ ఆలయంలో దుర్గాదేవిని సూచించే స్వరూపంగా అమ్మవారు కూర్చుని ఉంటుంది.
కేవలం ఈ ఆలయ పీఠమే విస్మయ స్పూర్తినిచ్చేది కాదు, ఈ ఆలయ చుట్టూఉన్న ప్రతిది అంతే అందంగా ఉంటుంది. భక్తులు ఈ ఆలయ మెట్లపై కూర్చుని కొన్ని గంటలు గడుపుతారు, ప్రకృతి గొప్పదనాన్ని ఆస్వాదిస్తారు. హజో చిన్న పట్టణం అయినప్పటికీ, పర్యాటకులు ఇతర ధార్మిక ఆకర్షణ స్థలాలలో ఆగినపుడు జాయ్ దుర్గ ఆలయాన్ని తేలికగా సందర్శించవచ్చు.