పోవ మక్కాకు మక్కాలో కనిపించే పవిత్రత ఉన్నట్లు భావిస్తారు. ఈశాన్య ప్రాంతంలో ముస్లింలకు ఇది ప్రధాన ధార్మిక ప్రదేశం, పోవ మక్కాని మక్కా నుండి తీసుకువచ్చిన ఇసుకను ఉపయోగించి నిర్మించారని చెప్తారు. పోవ అంటే పావు వంతు అని, అందుకే పోవ మక్కా అంటే ఈ మసీదు పవిత్ర మక్కాలో పావు వంతు అని సూచిస్తుంది, ముస్లిం లకు ఇది పవిత్ర నగరం.
1657 వ సంవత్సరంలో నిర్మించిన ఈ మసీదు గరుడాచల్ కొండపై ఉంది. ఈ మసీదులో ప్రపంచంలోని ఈ భాగంలో ఇస్లాం మత వ్యాప్తికి బాధ్యుడైన పీర్ గైసుద్దిన్ ఔలియ సాధువు సమాధి కూడా ఉంది. ఈ మసీదు మొఘల్ చక్రవర్తి షాజహాను పాలనలో మీర్ లుతుఫుల్లా-ఇ-షిరాజీ నిర్మించాడు.
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ముస్లింలు పీర్ గైసుద్దిన్ ఔలియ కి ప్రణమిల్లుతారు. నిర్మాణ తనిఖీకి వచ్చిన పర్యాటకులకు పోవ మక్కా కూడా గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది. పోవ మక్కా హయగ్రీవ మాధవ ఆలయానికి దగ్గరలో ఉంది.