కేదారేశ్వర ఆలయం, హజోలోని మదనాచల కొండల పైభాగంలో ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం భారతదేశ ఉపఖండంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది.
ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో ప్రమత్త సింఘ రాజు కాలంలో నిర్మించారు. కేదారేశ్వర ఆలయ పాదాల వద్ద ప్రసిద్ధ గణేష్ ఆలయం ఉంది. ఈ కేదారేశ్వర ఆలయంలో రాతితో చేసిన పెద్ద శివలింగం ఉంది. ఈ శివలింగం స్వయంభు గా పేరుగాంచింది. ఈ రూపంలో ఉన్న శివుడు అర్ధనారీశ్వరుడు అనికూడా పిలుస్తారు. ఇక్కడి శివలింగం లోహపు గిన్నెతో కప్పబడి ఉండడం అనేది గుర్తుంచుకోవలసిన విషయం.
పర్యాటకులు హజోలో ఉన్నపుడు గణేష్ ఆలయం, కేదరేశ్వర్ ఆలయ౦ రెంటినీ ఒకేసారి తేలికగా సందర్శించుకోవచ్చు. కేదారేశ్వర ఆలయం ప్రత్యేకమైనది, దీని పాత శాసనాలు గుర్తుంచుకోదగ్గ విలువైనవి. ప్రస్తుతం అధ్యయనాలు ఈ పాత శాసనాలకు గుర్తింపునిచ్చాయి.