హళేబీడు వచ్చే పర్యాటకులు హొయసలేశ్వర దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడ శివభగవానుడే హొయసలేశ్వరుడుగా అవతరించాడు. ఈ దేవాలయ నిర్మాణం 12 శతాబ్దంలో మొదలైంది. కాని ఢిల్లీ సుల్తానుల పాలన మొదలవటంతో నిర్మాణం ఆగిపోయింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అందంగా చెక్కబడిన శిల్పాలు, కళానైపుణ్య పనితనం మొదలైనవి తప్పక చూసి ఆనందిస్తారు.
హొయసలేశ్వర దేవాలయం ఒక నక్షత్ర ఆకారంలో ఉన్న స్మారక చిహ్నం. దీనిలో రెండు దేవాలయాలుంటాయి. రెండూ ఒకే రీతిలో ఉంటాయి. అయితే, రెండిటికి వివిధ ప్రాంగణాలు, మండపాలు కలిగి ఉంటాయి. ఈ దేవాలయానికి మరో ఆకర్షణ గరుడ స్తంభం మరియు రెండవ వీర బల్లాల బాడీగార్డు అయిన కురువ లక్ష్మ కొరకు తమ తలలు నరుక్కుంటున్న కత్తులను పట్టుకున్న చారిత్రక యోధులు. దేవాలయ గోడలు వివిధ దేవతల, దేముళ్ళ, నాట్యకారుల, పక్షుల, జంతువుల చెక్కడాలు కలిగి ఉంటాయి.
దేవాలయానికి దిగువ భాగంలో 2000 ఏనుగులు, వాటిపై స్వారీ చేసేవారు గుర్రాలు, పురాణేతిహాసాల జంతువులు, పూవులు మొదలైనవి చెక్కబడి ఉంటాయి. దక్షిణ మరియు పడమటి ప్రవేశాలలో అందంగా చెక్కబడిన ద్వారపాలకులు కనపడతారు. కొండశిఖరం, నంది మరియు శివ భగవానుడి రధం వంటివి కూడా దేవాలయ ప్రాంగణంలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇవి రెండూ కూడా క్షేత్రానికి ఒక కాలిమార్గం ద్వారా కలుపబడ్డాయి.



Click it and Unblock the Notifications