ఖాన్ నదీ తీరాన ఉన్నది ఈ కృష్ణపుర ఛత్రి. హోల్కర్ రాజవంశస్తులకి చెందినా స్మారక మంటపం ఇది. దీని నిర్మాణ కౌశలం మరియు దీని పై అలంకరించబడిన కళాకృతులు వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంది.ఈ మంటపాలు మరాఠా నిర్మాణ శైలిలో నిర్మితమైనవి. ఇవి గోపురాలతో మరియు డోముల ఆకృతి ల లో నిర్మించబడి ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రాత్రి పూట పర్యాటకులకి ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి పూట విద్యుద్దీపాలతో ఈ ఛత్రీ ల ని అలంకరించడం వల్ల మరియు అక్కడి కృత్రిమ కొలనుల ఫౌంటెన్ ల వల్ల ఈ ప్రాంతం అందంగా మారుతుంది. ఈ కొలను చుట్టుతా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి.