కుల్దారా, జైసల్మేర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రిక గ్రామం. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే సందర్శించడానికి అనుమతి౦చబడే భయానక గ్రామము. 200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు ఇక్కడ చూడవచ్చు. చరిత్ర ప్రకారం, ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు వుండేవారు. అక్కడి క్రూరమైన పాలకులు వాళ్ళను గ్రామ౦ వదలివెళ్ళమని బలవంతం చేసారు. అందువలన, ఆ గ్రామం పాలివాల్ బ్రాహ్మణులచే శపించ బడిందని ప్రజల నమ్మకం.