మాగోలు ఖాట్ అనేది జోర్హాట్ లోని ప్రధానమైన చారిత్రిక పర్యాటక కేంద్రం. మాగోలస్ లేదా మణిపురి అనే నిర్మాణాన్ని రాజేహ్వార సింహుడు మణిపురి యువరాణిని పెళ్ళాడాక నిర్మించాడు.
మనైమాజి గ్రామానికి చెందిన మణిపురి యువరాణి కురంగ నయనిని రాజు పెళ్ళాడాడు. జోర్హాట్ నగర కేంద్రం నుంచి మాగోలు ఖాట్ కేవలం 6 కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక రాజు తన భార్య కోసం ఎంత చేయగలడో ఈ నిర్మాణం చిహ్నంగా ఉండిపోతుంది. ఇప్పుడు శిధిలాల్లో ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇంకా తగ్గలేదు. ఈ ప్రాంతం అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ ఇప్పటికీ తనదైన అందాన్ని కలిగి వుంది.
జోర్హాట్ నగర కేంద్రం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఇక్కడికి చేరుకోవడం చాలా తేలిక. యాత్రికులకు టాక్సీలు అద్దెకు దొరుకుతాయి, ప్రజా రవాణా వాహనాలు, లేదా ఆటో రిక్షాల్లో కూడా చేరుకోవచ్చు. మాగోలు ఖాట్ సందర్శనలో ఆకట్టుకునేది ఏమిటంటే ఇది రోజంతా పట్టక పోవడమే.