పూర్ణానంద బురగోహిన్ భౌతిక కాయాన్ని దహనం చేసిన సమాధి పూర్ణానంద బురగోహిన్ మైదాం. మచ్చర్ హాట్ లో రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తీ ఆయన. శివసాగర్ వెళ్ళే దారిలో జోర్హాట్ నగర కేంద్రం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో పూర్ణానంద బురగోహిన్ మైదాం వుంది.
1817 లో పూర్ణానంద బురగోహిన్ కొడుకు ఈ మైదాం నిర్మించాడు. ఈ రోజు జోర్హాట్ లోని ప్రధానమైన చారిత్రిక కేంద్రాల్లో ఒకటిగా భావించే పూర్ణానంద బురగోహిన్ మైదాం ను ప్రతి ఏటా వేలాది మంది సందర్శిస్తారు. చారిత్రిక ప్రాధాన్యం కలిగి ఉండడమే కాకుండా ఈ మైదాం దివంగత రాజు గొప్పదనాన్ని కూడా దర్శింప చేస్తుంది.
అస్సాం లో మైదాం లు సాధారణం, ఇవి ఆ వ్యక్తులు సమాధి అయిన ప్రదేశాలుగానే కాకుండా అతని స్మృతులు, వైభవం ఎప్పటికీ జ్ఞాపకం వుండే ప్రదేశాలుగా కూడా పరిగణించ బడతాయి. నగర కేంద్రానికి దగ్గరగానే వుండడం వల్ల పూర్ణానంద బురగోహిన్ మైదాం ను తేలిగ్గానే చేరుకోవచ్చు.