జోర్హాట్ లో ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా భావించే రాజా మైదాం తోకలాయి నది దక్షిణపు ఒడ్డున వున్న సమాధి. దీన్ని 1894 అక్టోబర్ 1 వ తేదీన మరణించిన పురందర సి౦హుడి దహనం కోసం నిర్మించారు.
రాజా మైదాం ను ముందుగా దివంగత రాజు అస్తికల కోసం నిర్మించారు కానీ ఈనాడది ఆ గొప్ప అహోం రాజు గత వైభవ జ్ఞాపికగా ఉండిపోయింది. జోర్హాట్ లోని ఇతర మైదాం లలో లాగే చారిత్రిక ప్రాధాన్యం వల్ల రాజా మైదాం ను కూడా ఏటా వేలాది మ౦ది సందర్శిస్తారు. ఈ మైదాం ను అందంగా నిర్వహిస్తున్నారు, ఇది తనదైన ఠీవి ని ప్రదర్శిస్తూ నిలబడి వుంది.
జోర్హాట్ నగరం మధ్యలో నెలకొని వుంది రాజా మైదాం. అందువల్ల ఇక్కడికి వెళ్ళే దారి తెలియని యాత్రికులకు రవాణా తేలిగ్గానే దొరుకుతుంది. జోర్హాట్ యాత్రలో రాజా మైదాం కూడా తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications