మాక్ లేయోద్ గంజ్ చేత ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహింపబడే ప్రముఖ పండుగ అంతర్జాతీయ హిమాలయన్ ఫెస్టివల్. ఇండో-టిబెటన్ ఫ్రెండ్షిప్ వారు ప్రాయోజికత్వం వహిస్తున్న ఈ వేడుకకు హిమాచల్ ప్రదేశ్ టూరిసం శాఖ వారు అలాగే టిబెట్ యొక్క కేంద్ర పాలనా యంత్రాంగం మద్దతునిస్తునాయి. శాంతి ప్రతిపాదనలు అందించిన దలై లామా కి 1985 లోవచ్చిన నోబెల్ ప్రైజ్ ని పురస్కరించుకుని ఈ వేడుకని జరుపుతారు.
దలైలామా చేపట్టిన శాంతి ప్రతిపాదనలకి లభించిన ప్రశంసలకి చిహ్నంగా నిర్వహించే ఈ పండుగ టిబెటన్ లకి అత్యంత ముఖ్యమైనది. హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్న ప్రజలకి అలాగే టిబెటన్లకి ఉన్న సామరస్యాన్ని బలపరచేందుకు ఈ వేడుకని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. టిబెటన్ ఇన్స్టిట్యూట్ యొక్క వివిధ కళాకారులైన స్థానికులు, పిల్లలు మొదలగువారు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులని ఆహ్లాదపరుస్తాయి.