15 ఎకరాల మేరకు విస్తరించి ఉన్న ఈ పాలసు కాంగ్రా లో ని ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం చుట్టూతా పచ్చని టీ తోటలతో ఉన్న ఈ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంటుంది. చారిత్రకంగా ఈ పాలసు ని అల్హిలా అంటారు. అంటే, నెలవంక భూమి అని అర్ధం. మొట్టమొదట వేసవి విడిదిగా నిర్మించిన ఈ పాలసు తరువాత జమ్మూ కాశ్మీర్ రాజ కుటుంబీకుల చేతిలోకి వచ్చింది.
దౌలధర్ రేంజ్ పర్వత పదం వద్ద ఉన్న ఈ పాలసు ఒక ప్రఖ్యాత వారసత్వ హోటల్ గా మార్చబడింది. 1930 లో అభివృద్ధి పరచబడిన ఈ హోటల్ అంతర్గత భాగం లో ని అందచందాలతో, క్లాసీ లుక్ తో పర్యాటకులని సంతోషపరుస్తుంది. పురాతన కలోనియల్ వస్తువులతో, విశాలమైన ముఖ ద్వారాలతో, టేకు తో అలంకరించబడిన భోజన గదులతో విరసిల్లుతుంది.