కర్కల లో ప్రయాణించే ప్రయాణీకులు, కర్ణాటకలో అత్యంత ఆకర్షణీయమైన జైన్ స్మారకాలలో ఒకటిగా భావించే చతుర్ముఖ బసది ని తప్పక సందర్సించాలి. ఈ నిర్మాణం ఒక రాతి కొండపై ఉంది. 1432 లో వీర పాండ్య దేవుడు రాతి కొండపైన నిర్మించిన 108 స్తంభాలు కలిగిన ఈ ప్రదేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నల్ల రాళ్ళతో నిర్మించిన ఈ 108 స్తంభాలు చదునైన పైకప్పుకు ఆధారంగా నిలుస్తాయి.
గర్భాలయం లోకి పర్యాటకులను తీసుకు వెళ్ళే౦దుకు దీనికి నాలుగు దిశలలో నాలుగు ముఖద్వారాలు వుండడం వల్ల ఈ ప్రాంతానికి చతుర్ముఖ బసది అని పేరు వచ్చింది. గర్భాలయంలోకి ప్రవేశించిన తరువాత, సందర్శకులు సూర్యత, మల్లి, ఆరా ల విగ్రహాలను చూడవచ్చు. నిలబడిఉన్న విగ్రహాలే కాకుండా, ఇక్కడ గర్భగృహంలో యక్షి పద్మావతి, 24 తీర్ధంకరుల చిత్రాలను కూడా చూడవచ్చు. ధ్యానం చేయాలనుకునే వారికి ఈ చతుర్ముఖ బసది అనువైన ప్రదేశం.



Click it and Unblock the Notifications