పురాతన శివాలయం కర్నాలకు సమీపంలోని అంబర్ నాధ్ లో కలదు. దీనిలో శివ భగవానుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయాన్ని శిలాహార వంశానికి చెందిన మన్మమునిరాజ క్రీ.శ. 1060 సంవత్సరంలో నిర్మించాడు. దేవాలయ లోపలి భాగాలు ఎన్నో కుడ్య చిత్రాలు కలిగి అబ్బుర పరుస్తాయి. వైష్ణవ మరియు శైవ పురాణ గాధలు చెక్కబడ్డాయి. శివరాత్రి సమయంలో భుక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఈ దేవాలయంలో శైవులు మరియు వారితోపాటు వైష్ణవులు కూడా వచ్చి శివుడిని ఆరాధిస్తారు.



Click it and Unblock the Notifications