కోలార్ పట్టణం నుండి రెండు కి.మీ దూరంలో ఉన్న కోలార్ బెట్టని యాత్రికులు సందర్శించాలి. పూర్వం శతశ్రుంగ కొండలు (వంద శిఖరాల కొండలు) గా పిలవబడిన ఈ కోలార్ బెట్ట లేదా కోలార్ కొండలు ,యాత్రికులకు ఒక ప్రత్యేకమైన పిక్నిక్ ప్రదేశం . ఈ కొండపై చేరుకున్న తర్వాత యాత్రికులు ఒక పెద్ద మైదానాన్ని చూడవచ్చు.అంతేకాక, నిరంతరం ప్రవహించే అంతర గంగేని ఈ కొండ నుండి తూర్పు వైపున చూడవచ్చు.
అంతర గంగేలోని రాతి నంది (బసవ) నోటినుండి జాలువారే నీటిని యాత్రికులు చూడవచ్చు. ఎక్కడనుంచి ప్రారంభమవుతున్నాయో స్పష్టంగా తెలియకపోయినా ఇక్కడ నీరు మాత్రం ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. స్థానికులు ఈ నీటిని పవిత్ర జలంగా భావిస్తారు. ప్రచారంలో వున్న విశ్వాసం ప్రకారం దక్షిణ భారతంలో గంగ ఈ ప్రదేశం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని అంతర గంగే అంటారు. కోలార్ బెట్ట చూడాలనుకునే యాత్రికులు 100 కన్నా ఎక్కువ మెట్లెక్కి అక్కడికి చేరుకోవాలి.