కోలార్ లో ప్రయాణించే పర్యాటకులు బంగారంపేట తాలూకా లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని సందర్శించాలి. బ్రిటిష్ కాలంలో బంగారం ఉత్పత్తికి ఈ స్థలం పేరుగాంచింది. ఆ కాలంలో ఈ నగరం ఆంగ్లో-ఇండియన్లకే కాక, ఇటలీ, జెర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ జాతీయులకు నివాసంగా ఉండేది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) లో పనిచేసే వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు నివాసంగా ఉండేది. అయితే, 2003 నించి గనులు మూతబడటం వల్ల వారి సంఖ్య వేలనుండి వందలకు తగ్గింది. ఈ స్థలం లోని ప్రకృతి దృశ్యాలు, సమశీతోష్ణ వాతావరణం బ్రిటన్ ను పోలివుండటం వల్ల బ్రిటీష్ వారు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని “లిట్టిల్ ఇంగ్లాండ్” గా పిలిచేవారు. పర్యాటకులు ఇక్కడ బ్రిటీష్ నిర్మాణ శైలిలో నిర్మించిన భవనాలను కూడా చూసే అవకాశాన్ని పొందుతారు.
టోక్యో (JAPAN) తర్వాత ఆసియాలో జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుండి విద్యుత్ పొందే రెండో నగరంగా కోలార్ పేరుగాంచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కోసం విద్యుత్తును ఉద్పత్తి చేయడానికి దక్షిణ భారత దేశంలో మొదటిసారి 1902 లో (శివనసముద్ర) జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రారంభమై౦ది. ప్రయాణీకులు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు తూర్పున 3195 అడుగుల ఎత్తులో ఉన్న ప్రసిద్ది చెందిన దోడబెట్ట కొండను కూడా చూడవచ్చు.