కోలార్ జిల్లాలోని ఎల్లోడు కొండల పైన వున్న ఆదినారాయణ స్వామి గుడిని యాత్రికులు తప్పక చూడాలి. బాగేపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వున్న గుహాలయం ఇది. ఈ పుణ్య క్షేత్రంలో నగలు, అలంకారాలు లేని ఉద్భావమూర్తి రాతి విగ్రహం వుంటుంది. ప్రతీ ఆదివారం, ఇక్కడ ప్రత్యెక పూజ జరుగుతుంది.
ప్రతి ఏటా ఫిబ్రవరి – మార్చ్ నెలల్లో మాఘ మాసంలోని మూడో ఆదివారం నాడు ఆదినారాయణ స్వామి గుడిలో జరిగే రథోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ గుడిని చేరుకోవడానికి భక్తులు మొత్తం 618 మెట్లు ఎక్కాలి. ఈ 618 మెట్లలో గుడికి దగ్గరలో వున్న రెండు మెట్లు చాలా అసాధారణమైన ఎత్తులో వుండి, కేవలం తాడు సాయంతో మాత్రమె ఎక్కడానికి వీలవుతుంది.