1699లో రాణిజికి బావొరి (మెట్ల బావి)ని రావుగారి చిన్నభార్య రాణి నతావతి నిర్మి౦చి౦ది. ముఖ్యమైన సామాజిక నిర్మాణాలుగా పరిగణింపబడటం వలన భారతదేశంలో మధ్య యుగంలో బావులు ఒక ముఖ్య పాత్ర ను పోషించాయి.165 అడుగుల లోతు గల ఈ మెట్ల బావి రాజపుత్రుల విశిష్ట వాస్తు శైలికి నిదర్శనం.సన్నని ప్రవేశాన్ని కల్గి ఉండే ఈ బావి స్తంభాలపై రాతి తో నిర్మించిన ఏనుగులు వున్నాయి లోపలికి దిగే కొద్ది మెట్ల వెడల్పు పెరుగుతూ ఉంటుంది. ఈ బావి అందమైన ఎస్ ఆకారపు బ్రాకెట్ తో అలంకరించబడింది.