రావు మాదో సింగ్ మ్యూజియం కోట లోని ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ. కోటకు మొదటి రాజైన మాదో సింగ్ రాజు పేరిట దీనికా పేరు పెట్టారు. రాజప్రాసాదాన్ని తర్వాతి కాలంలో మ్యూజియంగా మార్చారు. నమూనాలను ఒక వరుస పద్ధతి లో పేర్చి ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియం లో ప్రతి వస్తువు పదిలంగా...
సమకాలీన ఇంజనీరింగ్ అధ్భుత౦గా పరిగణించబడే కోట బ్యారేజ్ ఈ నగరపు అనేక అవసరాలను తీరుస్తుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లోని రైతులకు ఇది ప్రధాన జల వనరు. పైగా ఈ బ్యారేజ్ విద్యుదుత్పత్తి సామర్ధ్యానికి ప్రసిద్ది చెందినది. 1960లో చంబల్ లోయ ప్రాజెక్ట్ లో నిర్మించిన డ్యాం లలో...
చంబల్ నది ఒడ్డున వున్న అమర్ నివాస్ లో చంబల్ ఉద్యానవనం వుంది. అందమైన పరిసరాల్లో వున్న ఈ పెద్ద పార్కు ఒక చక్కటి విహార కేంద్రంగా కూడా ఉపయోగపడుతోంది. ఈ తోట మధ్యలో వున్న చెరువు లో కొన్ని మొసళ్ళు కూడా వున్నాయి. ఈ చెరువు మీద ఒక వేలాడే వంతెన కూడా నిర్మించారు.ఒకప్పుడు నది...
కోట లోని చంబల్ నది తూర్పు అంచున వుండే సిటీ ఫోర్ట్ పేలస్ రాజస్థాన్ లోని అతి పెద్ద కోటల సముదాయానికి ప్రసిద్ది. కోట నగరం లో ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణ. ధృడమైన ఈ కోట గోడలు, గోపురాలతో, రైలింగ్ తో అలంకరించిన కోట బురుజు, ఆ నాటి రాజుల వైభవాన్ని ప్రదర్శిస్తాయి. 17వ శతాబ్దం...
చంబల్ నది వద్ద గల గరడియా ఆలయం కోట లోని ఒక పేరొందిన దేవాలయం. ఈ ప్రాంతం నుండి కనబడే చంబల్ నదీ ముఖద్వారం, మైదానాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది ఈ ప్రాంతపు ప్రసిద్ధ విహార కేంద్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రశాంత, నిర్మల ప్రకృతి లో సేదతీరాలనుకొనే పర్యాటకులు ఈ...
కోట లోని కృత్రిమ సరస్సు కిషోర్ సాగర్ మధ్యన జగ్ మందిర్ పేలస్ వుంది. ఈ సరస్సును 1346 లో బుండీ కి చెందిన దేహ్రా డే అనే రాజు నిర్మించగా, పేలస్ ను 1740 లో కోట రాణుల్లో ఒకరు నిర్మించారు. అందమైన ఎర్రని ఇసుకరాయి తో నిర్మించిన ఈ భవనం చాలా అధ్బుతంగా కనపడుతుంది. సరస్సులో...
చంబల్ నది ఒడ్డున తెలుపు పాలరాతి తో కోటలో నిర్మించిన అందమైన దేవాలయం గోదావరి ధాం దేవాలయం. ఈ దేవాలయ గోపురాలు ఎంతో ఎత్తుగా ఉండి ఆకట్టు కొంటాయి. ఈ దేవాలయాన్నిప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.
1699లో రాణిజికి బావొరి (మెట్ల బావి)ని రావుగారి చిన్నభార్య రాణి నతావతి నిర్మి౦చి౦ది. ముఖ్యమైన సామాజిక నిర్మాణాలుగా పరిగణింపబడటం వలన భారతదేశంలో మధ్య యుగంలో బావులు ఒక ముఖ్య పాత్ర ను పోషించాయి.165 అడుగుల లోతు గల ఈ మెట్ల బావి రాజపుత్రుల విశిష్ట వాస్తు శైలికి...
కోట ప్రధాన మార్కెట్ మధ్యలో వున్న ఒక అందమైన కట్టడం దేవత శ్రీధర్జీ హవేలీ. ఇది ప్రధానంగా కుడ్య చిత్రాలకు ప్రసిద్ది పొందింది.
కిషోర్ సాగర్ సరస్సుకు దగ్గరగా వున్న బిర్జ్ విలాస్ పేలస్ లో వుండే ప్రభుత్వ మ్యూజియం కోట లోని ప్రసిద్ధ యాత్రిక ఆకర్షణ. ఈ మ్యూజియం లో పాత నాణేలు, పురాతన వ్రాత ప్రతులు, హదోటి శిల్పాల అరుదైన సంగ్రహం వుంది. ఇక్కడ ప్రదర్శించిన శిల్పాలన్నిటిలోకి బరోలి నుంచి తెచ్చిన శిల్పం...
కోట నుంచి 45 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన ప్రదేశం బరోలి. కోట నుంచి రానా ప్రతాప్ సాగర్ కు వెళ్ళే దారిలో ఇది వస్తుంది. బరోలి లోని ప్రశాంత వాతావరణం దేశవ్యాప్తంగా యాత్రికులను ఆకర్షిస్తుంది.పురాతన, అందమైన ఘాటేశ్వర దేవాలయం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందింది. ఈ క్షేత్రం...
మధురాదీష్ మందిరం కోట లోని ప్రసిద్ధ ధార్మిక క్షేత్రాలలో ఒకటి. కృష్ణుడి కోసం నిర్మించిన ఈ గుడికి కృష్ణ భక్తులైన వల్లభ సంప్రదాయానికి చెందిన వారు వస్తారు. కృష్ణుడి విగ్రహం పక్కనే రాదా దేవి విగ్రహం కూడా వుంది.
చేతితో నేసిన కోట డోరియా చీరలకు కైతూన్ ప్రసిద్ది. బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన నాణ్యమైన కాటన్ దుస్తులు ఇక్కడ దొరుకుతాయి. ఆసక్తి కల్గిన పర్యాటకులు చీరలను నేసే పద్ధతిని కూడా చూడవచ్చు.
కోట కు దగ్గరలో గల అల్నియా చరిత్ర పూర్వపు చెక్కడాలకు ప్రసిద్ది చెందింది. పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులుఇక్కడ కనుగొన్న రాతి చెక్కడాలు చరిత్రకు పూర్వపువని ద్రువీకరించారు. వీటిని రాళ్ళతో చేసిన పదునైన పరికరాలతో చెక్కారు. రాతి చెక్కడాలు ప్రధానంగా పాత జానపద గాధల...
దర్రా వన్యప్రాణి అభయారణ్యాన్ని 1955లో స్థాపించారు. గతంలో అనేక ఖడ్గమృగాలు, జింకలు, పులులు ఉండటం వలన వేటాడటానికి కోట రాజులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో జింక, ఎలుగుబంటి, తోడేళ్ళు, లేడి,చిరుతపులులు, నిల్గై వంటి విభిన్న జాతులకు చెందిన జంతువులు...