కోట లోని కృత్రిమ సరస్సు కిషోర్ సాగర్ మధ్యన జగ్ మందిర్ పేలస్ వుంది. ఈ సరస్సును 1346 లో బుండీ కి చెందిన దేహ్రా డే అనే రాజు నిర్మించగా, పేలస్ ను 1740 లో కోట రాణుల్లో ఒకరు నిర్మించారు. అందమైన ఎర్రని ఇసుకరాయి తో నిర్మించిన ఈ భవనం చాలా అధ్బుతంగా కనపడుతుంది. సరస్సులో బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఈ భవంతి ప్రతిబింబాన్ని ప్రశాంత సరస్సులో చూడవచ్చు. ఈ భవంతిని కోట లోని పూర్వపు రాజుల వినోదం కోసం నిర్మించారు. రాజ సమాధులు ఉన్న కేశర్ బాగ్ ఈ పేలస్ కు దగ్గరలోనే వుంది.