కృష్ణ మీనన్ మ్యూజియం, కాలికట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి, నగరం నుండి 5 కిమీ దూరంలో ఉంది. ఇది తూర్పు హిల్ అనే ప్రదేశంలో ఉంది,మరియు పజహస్సి రాజా మ్యూజియం దగ్గరగా ఉంది.మ్యూజియం ఇండియా లోని గొప్ప జాతీయ నాయకుడు వి.కె. కృష్ణ మీనన్ జ్ఞాపకార్థం 1975 లో నిర్మించారు. మ్యూజియంలో చిత్రాలు మరియు శిల్పాలను మనం చూడవచ్చు.దీనిలో ఆర్ట్ కోసం ప్రత్యేక విభాగం ఉంటుంది.ఇక్కడకు చేరుకోవటానికి పర్యాటకులు బస్సు మార్గం ద్వారా రావచ్చు, లేదా రిక్షాలు అద్దెకు తీసుకోని రావచ్చు.కృష్ణ మీనన్ మ్యూజియం అన్ని రోజులు అంటే జాతీయ సెలవు రోజులలో కూడా తెరిచి ఉంటుంది,కానీ సోమవారం సెలవు రోజు.ఉదయం 10 AM నుంచి సాయంత్రం 5 PM. వరకు సందర్శకులను అనుమతి ఇస్తారు.భారతదేశం యొక్క సాంస్కృతిక ,జాతీయ మరియు కళాత్మక చరిత్రలో ఆసక్తి ఉన్న వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.



Click it and Unblock the Notifications