కేరళలో ఉన్న అతి ప్రాచీన మరియు చారిత్రిక గుడి అయిన వైకోం మహాదేవ టెంపుల్ దేశ వ్యాప్తంగా పర్యాటకుల మరియు భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. వెంబనద్ సరస్సు పక్కనే ఉన్న వైకోమ్ పట్టణంలో ఈ గుడి ఉంది. శైవులు మరియు వైష్ణవులచే పూజింపబడిన అతి కొద్ది గుడులలో ఈ శివుని గుడి ఒకటి అవడం ఈ గుడికున్న ప్రత్యేకత. 1924 లో ఇక్కడ జరిగిన వైకోమ్ సత్యాగ్రహం (అంటారనితనం కి వ్యతిరేకంగా) అనే ప్రముఖ మైన సంఘటన కి గుర్తుగా ఇక్కడి గుడి పేరుని బంగారు అక్షరాలతో రాయించారు. ఈ మహోన్నతమైన శివుడి గుడి ఎనిమిది ఎకరాల మేరకు విస్తరించబడినది. 'వైకోమ్ అష్టమి' అనే పండుగ ఈ గుడిలో జరుపుకునే ప్రధాన పండుగ. నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఈ పండుగని జరుపుకుంటారు. రాయిపై చెక్కబడిన గణపతి విగ్రహం మరియు నంది విగ్రహం ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో అగుపిస్తాయి. ఈ వైకోమ్ మహాదేవ టెంపుల్, కుమరకోమ్ నుండి 22 కి మీ ల దూరం లో, కొట్టాయం పట్టణం నుండి 32 కి మీ ల దూరంలో ఉంది. ఈ గుడికి సులభంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications