మధుర లో టెంపుల్స్ మాత్రమే కాక, యమునా నది ఒడ్డు నిండా వరుసగా అనేక స్నానపు ఘాట్ లు కూడా కలవు. ఈ ఘాట్లు చాలా వరకూ రాతి మెట్లు కలిగి వుంటాయి. ఈ నీటిలో మునిగితే పాపాలు పోతాయని, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఈ నది ఒడ్డున అనేక మతపర కార్యక్రమాలు చేస్తారు. అనేక మంది హిందువులు ఘాట్ లలో మునగటం గమనించవచ్చు. ఉదయం, సాయంత్రం హారతులు ఇస్తారు. ఈ ఘాట్ ల వద్దే ఆశ్రమాలు, గుడులు వుంటాయి.