ఈ కోట యమునా నది ఒడ్డున కలదు. ఇపుడు శిధిలమై వుంది. ఈ కోట విశాలమైన ప్రదేశంలో ఎత్తైన గోడలతో బలంగా నిర్మించ బడింది. రాజా మాన్ సింగ్ దీనిని 16 వ శతాబ్దంలో పునరుద్ధరించగా, జైపూర్ మహారాజు సవాయి జై సింగ్ ఇక్కడ ఒక అబ్సర్వేటరీని నిర్మించాడు. ఇపుడు దాని అవశేషాలు మాత్రమె కనపడతాయి.