మధురలో హిందూ మతం ప్రధానంగా రాక ముందు ఇక్కడ బౌద్ధ, జైన మతాల క్షేత్రాలు ఉండేవి. వీటిని మొగలు పాలకులు నాశనం చేసినప్పటికీ, ఇంకనూ కల కొద్ద వాటిని యాత్రికులు చూస్తూనే వుంటారు. మధుర చౌరాసి అనేది ఒక జైన మందిరం. ఈ పవిత్ర ప్రదేశం యమునా నది ఒడ్డున ఒక అడవి లో కలదు.
ఈ మందిరంలో రంగు రంగుల పెయింటింగ్ లు గోడలపై శాసనాలు , కళాకృతులు వుంటాయి. ఈ టెంపుల్ చాలా విశాల ప్రదేశం లో రెండు ధర్మశాలలతో కట్టారు. ఒక్కొక్క ధర్మశాల లోను అరవై గదులు కలవు. ఈ గదులను యాత్రికులకు వసతిగా ఇస్తారు.