బంద్రా - ముంబై సీ లింకు ముంబై లోని ప్రధాన మరియు తాజా నిర్మాణం. ముంబై స్కై లైన్ కు ఇది ఒక అద్భుత నిర్మాణం. వేలాడే ఈ 8 లైనుల బ్రిడ్జి మోటారిస్టులను వర్లి మరియు బంద్రాల మధ్య పది నిమిషాలలో ప్రయాణింపజేస్తుంది. సాధారణంగా ఇండియాలోని వేలాడే వంతెనలు క్లిష్టమైన వాటి నిర్మాణం కారణంగా పెద్దగా విజయవంతం కాలేదు.
కాని ముంబై లోని ఈ ముంబై సీ లింకు నిర్మాణం, అన్నిటికంటే మెరుగైనదిగా చెప్పబడుతోంది. బ్రిడ్జి నుండి అరేబియా మహా సముద్ర అందాలు అద్భుతంగా గోచరిస్తాయి. ఈ బ్రిడ్జి కి టోల్ రేటు రెండు వైపులా కలిపి రూ.75 గా మోటారిస్టులనుండి చార్జి వసూలు చేస్తారు.



Click it and Unblock the Notifications