నాద సాహిబ్ పంచకుల లోని ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఈ గురుద్వారం శివాలిక్ కొండ దిగువ భాగాన, ఘగ్గర్ నది ఒడ్డు వద్ద నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సిక్కులకు చాలా ప్రసిద్ది గాంచింది. చరిత్ర ప్రకారం, భంగని యుద్ధం లో ముఘలులను ఓడించిన తరువాత గురు గోవింద్ సింగ్ వారి అనుచరులతో ఇక్కడ ఉన్నారు.
గురు గోవింద్ సింగ్ అనుచరుల్లో ఒకడైన నాడు షాహ్, గురువుచే అశీర్వదించ బడి, విజయ యోధులను స్వాగతించారు. అప్పటినుండి నాద సాహిబ్ పేరుమీదగా గురుద్వారా కు ఆ పేరువచ్చింది. ప్రతి నేల వచ్చే పూరన్మషి లేదా పౌర్ణమి రోజు అనేకమంది సిక్కులు సందర్శిస్తారు. మొత్తం ఉత్తర భారతదేశ ప్రజలు ఈ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. మోత సింగ్ నిర్మించిన అసలు మంజీ సాహిబ్ పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఇది రెండంతస్తుల నిర్మాణం. ఇది సమావేశ మందిరం ఆనుకుని ఉంది. గురు కా లాంగర్, యాత్రీకుల వసతులు ప్రస్తుతం వివిధ ప్రాంగణాలలో ఉన్నాయి. ఇది ఒక ఇటుక ప్రాంగణంలో ప్రధాన గురుద్వారా నుండి వేరుగా ఉంది.
ఈ మందిరానికి చెందిన పవిత్రమైన జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. కమ్యూనిటీ భోజనం, మతపరమైన సమావేశాలు ప్రతిరోజూ జరుగుతాయి. పార్కింగ్, లంగర్ హాల్ కోసం మూడు అంతస్తుల కొత్త భవన ప్రణాళిక జరుగుతుంది. సిక్కు చరిత్రపై దృష్టి కేంద్రీకరించే ఒక మ్యూజియం కూడా ఏర్పడబోతుంది.