అంబర్ ఖానా కోట పన్హాలా వచ్చినవారు తప్పక చూడాలి. ఈ కోటను మరాఠా పాలకులు అతి బలంగా, పెద్దదిగా నిర్మించారు. నేటికి ఈ కోట తర్వాత నిర్మించిన కోటలు అన్నిటికంటే పెద్దగానే కనపడుతుంది. పాలనా విభాగం మరియు రాజ భవనం మరియు మింట్ లేదా ఖజానా వంటివి కోటలో కలవు. సమీపంలోని మరో పురాతన భవనాన్ని ధాన్యంచ కొఠార్ అని పిలుస్తారు. దీనిలో ఆహార ధాన్యాలు నిలువచేసేవారు. మొత్తంగా ఇక్కడ మూడు ధాన్యాగారాలు కలవు. వాటిని గంగా, జమున మరియు సరస్వతి అని పిలుస్తారు. ఒక్కొక్క ధాన్యాగారం ఆనాటి లెక్కల మేరకు 25,000 ఖండీల ధాన్యాన్ని నిలువ చేస్తుంది.