కున్జపురి దేవి ఆలయం రుషికేష్ నుండి 15 km దూరంలోఒక చిన్న కొండ మీద ఉన్నది. ఈ ఆలయం శివాలిక్ శ్రేణి యొక్క పదమూడు అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకటి. ఈ ఆలయం నుండి సూర్యాస్తమయం మరియు సూర్యోదయం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రయాణీకులు చుఖంబ,స్వర్గ, రోహిణి, బందేర్పున్చ్ మరియు గంగోత్రి తో సహా గర్హ్వాల్ హిమాలయాల శిఖరాలను చూడవచ్చు.
జానపద కధ ప్రకారం, సతీదేవి భర్త అయిన శివుడుకి ,తన తండ్రి అయిన రాజు దక్ష ద్వారా అవమానాలు జరిగినప్పుడు సతి దేవి ప్రాణత్యాగం చేసుకొనెను. అప్పుడు శివుడు విచారంగా ఆమె శరీరంను కైలాష్ పర్వతం మీదకు మోస్తున్న సమయంలో సతి యొక్క పై భాగం ఈ ఆలయ ప్రదేశంలో పడినది అని చెప్పుతారు.