ఛత్రి అనేది ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకార్ధం గా ఏర్పాటు చెయ్యబడిన ఖాళీ సమాధి. ఆ వ్యక్తి యొక్క అవశేషాలు వేరే ఎక్కడో ఉన్నప్పటికీ ఈ ఖాళీ సమాధిని వారి జ్ఞాపకార్ధం గా భావిస్తారు. యుద్ద స్మారక చిహ్నాలుగా ఎప్పటినుంచో ఇది పాటిస్తున్నారు. గ్రీక్ వర్డ్ నుండి తీసుకోబడిన ఖాళీ సమాధి ల ను చనిపోయిన వ్యక్తుల యొక్క స్మారక చిహ్నం గా ఏర్పాటు చేస్తారు.
సిండియా క్లాన్ యొక్క రాజవంశానికి శివపురి లో ఉన్న ఈ ఛత్రీ ల ను అంకితమిచ్చారు. ఇవి చరిత్ర ప్రకారమే కాకుండా వాటి నిర్మాణ శైలి పరంగా కూడా గొప్పవి. శివపురి ఛత్రీలు పాలరాతి కట్టడాలు అందంగా అలంకరింపబడి ఉన్నవి. వీటిని ఎన్నో ఏళ్లుగా సంరక్షిస్తున్నారు. ఒక పెద్ద కృత్రిమ మొఘల్ ఉద్యానవనం నేపధ్యం లో సరస్సు కి రెండువైపులా ఉన్న ఛత్రీలు సిండియా రాజ వంశీకులకు అంకితమిచ్చినవి. మాధవ్ రావు సిండియా కి అలాగే అతని భార్య మహారాణి సఖ్య రాజే కి ఈ ఛత్రీలు అంకితమివ్వబడినవి.