మేల తిరువెంకటనాథపురం ఆలయం ఇదే పేరుతో ఉన్న ఆసక్తికర చిన్న గ్రామంలో ఉంది. ఒక చిన్న కొండపైన ఉన్న ఈ ప్రాంతాన్ని తిరునంకోవిల్ అని కూడా పిలుస్తారు. పురాణాల ననుసరించి వ్యాస మహర్షి శిష్యుడు పైలర్ సన్యాసి తమరబరని ఒడ్డున తప్పస్సు చేసాడని అంటారు. మహావిష్ణు అతని తపస్సుకు సంతోషించి, అతని ముందు శ్రీనివాసునిగా ప్రత్యక్షమయ్యాడు. పైలర్ సన్యాసి కోరికమేరకు దేవుడు ఇదే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అంగీకరించాడు. ప్రారంభంలో ఈ ఆలయం నిర్మాణానికి కారణం ఈ సన్యాసి అయినప్పటికీ, ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని మాత్రం వెంకటప్ప నాయికర్ మహారాజు కట్టించాడు. ఈ ఆలయానికి దగ్గరలో తమిరబరని నదిలోని స్నానమాచరించే ప్రాంతాన్ని శ్రీనివాస తీర్థ ఘాట్ అంటారు. ఇక్కడ జరిగే అత్యంత ముఖ్యమైన ఉత్సవం “గరుడ సేవై”. దీనిని ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో వచ్చే తమిళ నెల వైశాఖిలోని ప్రతి శనివారం, తిరువోనం రోజున జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications