సునేహ్రి కోఠీ గొప్ప చారిత్రిక ప్రాముఖ్యత కల్గి షీష్ మహల్ గా కూడా పిలిచే సునేహ్రి కోఠీ ప్రతి ఏటా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కట్టడం లోపలి గోడల పై బంగారపు మెరుగుతో బాటు వజ్రాలు, గాజుతో చేసిన అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి. సంగీతం, నాట్యం, కవితా పఠనాలు అంటే ఎంతో ఇష్టపడే నవాబ్ ఇబ్రహీం అలీ ఖాన్ ఈ మహల్ ను టో౦క్ లోని నజర్ బాఘ్ రోడ్డులో నిర్మించాడు.
ఈ భవనంలో గల కళారూపాలు, అద్భుతమైన నిర్మాణశైలికి ప్రశంసగా దీనిని మాన్షన్ ఆఫ్ గోల్డ్ అని కూడ అంటారు. సునేహ్రి కోఠీ నిర్మాణమంతా ఎనామిల్ నగల అధివాస్తవిక స్వర్గపు ముక్క వలె ఉంటుంది.