Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అత్యంత సంప‌న్నదేవాల‌యాల‌ను చూశారా?

భారతదేశంలోని అత్యంత సంప‌న్నదేవాల‌యాల‌ను చూశారా?

భారతదేశంలోని అత్యంత సంప‌న్నదేవాల‌యాల‌ను చూశారా?

పురాతన కాలం నుండి భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో పురాత‌న ఆల‌యాలు, చారిత్రాత్మ‌క నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలు దేశంలోని ప్రజల విశ్వాసానికి చిహ్నంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ప్రాంతాల‌ను సందర్శించడానికి ఇక్కడకు వస్తుంటారు. అయితే దర్శనంతో పాటు లక్షల రూపాయల విలువైన బంగారం, రూపాయిలను సమర్పిస్తుంటారు. కాబట్టి భారతదేశంలోని అలాంటి గొప్ప దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

padmanabhaswamytemple1

పద్మనాభ స్వామి ఆలయం

భారతదేశంలో ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలు మరియు కోట్ల సమర్పణలు జరుగుతాయి. పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని త్రివేండ్రంలో ఉంది. ఈ మతపరమైన ప్రదేశం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా గుర్తించారు. ఆలయ సంపదలో వజ్రాలు, బంగారు ఆభరణాలు మరియు బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడిలో ప్రతిష్టించిన మహావిష్ణువు విగ్రహం బంగారంతో నిర్మితమైందని, ఈ విగ్రహం ఖరీదు 500 కోట్లు ఉంటుందంటున్నారు.

tirupatibalajitemple1

తిరుపతి బాలాజీ ఆలయం

తిరుపతి బాలాజీ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో తిరుమల కొండపై ఉంది. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా కూడా పరిగణించబ‌డింది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ దేవాలయం అనేక అద్భుతాలు మరియు రహస్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి ప్రతిరోజు లక్షలాది రూపాయలు సమర్పిస్తారు మరియు ప్రతి సంవత్సరం సుమారు 650 కోట్ల రూపాయలను కూడా భక్తులు విరాళంగా సమర్పిస్తారు.

shirdisaibabatemple

షిర్డీ సాయి బాబా ఆలయం

షిర్డీ సాయిబాబా ఆలయం వార్షిక ఆదాయం రూ. 900 కోట్లకు పెరిగింది, కోవిడ్‌కు ముందు దాని ఆదాయం రూ. 800 కోట్లు. ఈ ఏడాది ఆలయ ఆదాయానికి సంబంధించిన ప్రతి రికార్డు బద్దలైంది. వీటన్నింటితో పాటు, ఆలయం ఆన్‌లైన్‌లో ఏదో ఒకదానిని మాత్ర‌మే అంటే బహుమతులు కానీ, న‌గ‌ల‌ను కానీ ద‌క్ష‌ణ రూపంలో తీసుకుంటారు.

siddhivinayakatemplemumbai1

సిద్ధి వినాయక దేవాలయం, ముంబై

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పలువురు ప్రముఖులు వస్తుంటారు. ప్రతి భక్తుడు ఇక్కడ పెద్ద మొత్తంలో నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ ఆలయానికి కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన 3.7 కిలోల బంగారంతో పూత పూశారు. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దాదాపు 125 కోట్లు విరాళాలు అందుతాయి.

matavaishnodevitemple

మాతా వైష్ణో దేవి ఆలయం

మాతా వైష్ణో దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒక‌టిగా ప్రసిద్ధి చెందడమే కాకుండా దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో కూడా ఒకటిగా నిలిచింది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు రూ. 500 కోట్ల ఆదాయం వస్తుంది. దీని కారణంగా ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒక‌టిగా చేర్చబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం దేశం మరియు ప్రపంచం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

More News

Read more about: padmanabha swamy temple
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+