ట్రిచీ నగరం నడిబొడ్డున విరలిమలై కొండ పై వుంది విరలిమలై మురుగన్ దేవాలయం. 207 మెట్లు ఎక్కి ఈ గుడికి చేరుకోవాలి. ఈ గుడికి వెళ్ళే దారిలో వున్న మంటపాలు యాత్రికులకు విశ్రామ కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇక్కడ జరిగే వివిధ ఉత్సవాల్లో దండాయుధపాణి స్వామికి చుట్ట సమర్పించడం కూడా ఒకటి. ఈ చుట్టను గంధంతో తయారు చేస్తారు. ఇది ఈ గుడిలోని ప్రధాన ఉత్సవాల్లో ఒకటి.
ఈ గుడి చుట్టూ పండ్ల తోటలు, చాలా పనస చెట్లూ వుంటాయి. ఈ చెట్లను ప్రాచీన కాలంలోని రుషి మునులు విరలిమలై మురుగన్ దేవాలయం లో స్వామికి సమర్పించడానికి ఉపయోగించేవారు. ఈ గుడి చుట్టూ నెమళ్ళు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం ఆవరణలో నారద ముని, కశ్యప రుషి విగ్రహాలు కూడా వున్నాయి. అరుముగన్, అరుణగిరి నాథార్ విగ్రహాలు కూడా ఇక్కడి స్తంభాలపై చెక్కి వున్నాయి.