ఉడుపికి పడమర దిశగా సుమారు 2 మైళ్ళ దూరంలో మహిషమర్దిని దేవాలయం ఉంది. ఈ దేవాలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. దీనికి నసుమారు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. కడియాలి మహిషమర్దిని దేవాలయం ఉడుపి క్రిష్ణదేవాలయానికి దగ్గరలోనే ఉంది. దీనికి సమీపంలోనే మణిపాల్ విశ్వవిద్యాలయం ఉంటుంది. ఈ దేవాలయం చాళుక్య రాజుల కాలంనాటిది. ఇటీవలే భక్తుల సహకారంతో అది పునరుద్ధరించబడింది. మాత మహిషమర్దిని విగ్రహం ఇక్కడ నిలబడిన భంగిమలో ఉంటుంది. దేవాలయం రాతితో కట్టబడి ఉంటుంది. సీలింగ్ గ్రానైట్ స్లాబ్స్ తో వేయబడి ఉంటుంది. దేవాలయంలో ప్రధాన ఆకర్షణలు అంటే మాత దుర్గాదేవి రధోత్సవం ప్రతిసంవత్సరం నిర్వహిస్తారు. అనంతేశ్వర దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ ఇది కూడా మహిషమర్దిని దేవాలయ సమీపంలోనే ఉంది.
బస్సు, టాక్సీ ఆటో రిక్షా మొదలైన రవాణాసదుపాయాలు ఉడుపి మరియు కడియాలిల మధ్య అందుబాటులో ఉన్నాయి



Click it and Unblock the Notifications