పజక శ్రీ మధ్వాచార్యుల జన్మస్ధలం. ఈయన ద్వైత వేదాంతి. వీరి నివాసం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మధ్వ మందిరం కూడా కలదు. ఇక్కడ అనేకమంది భక్తులు వస్తారు. ఎన్నో మతపర కార్యకలాపాలు జరుగుతాయి. వేద తరగతులు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలో పరశురామ దేవాలయం కలదు.
ఇక్కడే శ్రీ అనంతపద్మనాభ దేవాలయం కూడా కలదు. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్ని మధ్వాచార్యులకు సంబంధించినవే. మధ్వాచార్యులు నాటిన ఒక రావి చెట్టును, ఆయన ఉపయోగించిన కొలనును సైతం చూడవచ్చు. పజక క్షేత్ర ఉడుపి నుండి 13 కి.మీ.లు. రైలు సౌకర్యం కలదు. మంగుళూరు సమీప విమానాశ్రయం. ఉడుపి నుండి పజకకు బస్ లు తరచుగా కలవు. ఉడుపిలో వసతి సౌకర్యాలు కలవు.