అనంతేశ్వర దేవాలయం ఉడుపి లో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. అది కేరళలో ఉన్నప్పటికి కర్నాటకక కూడా ఎంతో ప్రధానంగా భావిస్తారు. దీనినే మంజుళా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం కేరళలోని కాసర్ గోడ్ జిల్లా మంజేశ్వర్ లో ఉంది. ఇది కూడా దక్షిణ భారతదేశ ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయ నిర్మాణం సుమారు వేయి సంవత్సరాల క్రిందటిదని చెపుతారు. దేవాలయానికి మూడు పక్కలా కొండలు మరియు నాలుగవ వైపుగా మంజేశ్వరనదిప్రవహిస్తాయి.గుడిలో ముగ్గురు ప్రధాన దేవుళ్ళు ఉంటారు. వారు శ్రీ అనంత, శ్రీ ఈశ్వర మరియు స్వామి భద్ర నరసింహ (మహావిష్ణు అవతారం). 12వ శతాబ్దం నుండి ఈ దేవాలయం ఒక ప్రధాన యాత్రా స్ధలంగా విష్ణు భక్తులకు మారింది. దేవాలయం ఉడిపి సమీపంలో ఉంది. మంజేశ్వర రైల్వే స్టేషన్ కు 1.5 కి.మీ. దూరంలో ఉంది. ఉడుపి మంజేశ్వరలనుండి దేవాలయానికి బస్ సర్వీసులున్నాయి. బస చేయటానికి కూడా అనుకూలంగా హోటళ్ళు ఉన్నాయి.