సాలిగ్రామ నరసింహ దేవాలయం ఎన్ హెచ్ 17 రోడ్డులో ఉడుపి జిల్లాలో కలదు. ఇక్కడ అతి పెద్ద గురు నరసింహ దేవాలయం కలదు. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలది. ఈ విగ్రహాన్ని నారదుడు ప్రతిష్టించాడని చెపుతారు. ప్రతి సంవత్సరం జరిగే రధోత్సవానికి వేలాది భక్తులు తరలి వస్తారు.
ఈ ప్రదేశం ఉడుపి, కుందాపూర్ మధ్య లో కలదు. ఉడుపి నుండి 21 కి.మీ. మంగుళూరు నుండి 81 కి.మీ.లు. బెంగుళూరు నుండి సాలిగ్రామకు బస్ లు కలవు. సాలిగ్రామనుండి స్ధానిక రవాణా ఆటోలలో వెళ్ళాలి. మంగుళూరు, ఉడుపిలలో బసకు వసతి కలదు.